Hyderabad Metro: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే అమల్లోకి కొత్త మెట్రో ఛార్జీలు.. ఎంత పెంచారంటే?

Hyderabad Metro Charges Hike Today Onwords: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. పెరిగిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ తెలిపింది. ఇప్పటివరకు తొలి రెండు స్టాఫ్లకు రూ. 10 ఉండగా.. కొత్త ఛార్జీల ప్రకారం రూ. 2 పెంచారు. దీంతో మొదటి రెండు స్టాఫ్లకు రూ. 12 వరకు పెరిగింది. అంతకుముందు గరిష్టంగా రూ. 60 ఉండగా.. తాజాగా, రూ.75కు చేరింది. దీంతో మెట్రో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.
కొత్త ధరలను కనిష్టంగా రూ.2 పెంచగా.. గరిష్టంగా రూ.16 వరకు పెంచినట్లు తెలుస్తోంది. మొదటి 2 కిలోమీటర్ల వరకు రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.12 వరకు పెరిగింది. అలాగే 2 కిలో మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకు రూ.18, 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు రూ.30, 6 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు రూ.40, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.50, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు రూ.55, 15 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ.60, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.66, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు రూ.70, 24 కిలోమీటర్లకు పైగా రూ.75 వరకు పెంచారు.
ఇదిలా ఉండగా, పెంచిన ధరలతో నిత్యం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారనుంది. ఒక్కో ప్రయాణికుడికి 30 రోజులకు ప్రస్తుత ఛార్జీలు కాకుండా సుమారు రూ.1000 అదనంగా భారం పడనుంది. దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కొంతమంది తమ వాహనాలను పార్కింగ్లో ఉంచి కార్యాలయాలకు వెళ్తుంటారు. దీంతో పార్కింగ్ ఫీజు కూడా అదనపు భారం పడనుంది. ప్రస్తుతం మెట్రో పార్కింగ్లో టూ వీలర్ వాహనాలకు రూ.25 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో మరో రూ.600 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నట్లు మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు.
కాగా, మెట్రో ఛార్జీలను పున:పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు. సాధారణ ప్రజలపై భారం పడకుండా ప్రయాణ వ్యయాన్ని సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మెట్రో మాత్రం నష్టాలను సవరించేందుకు ఛార్జీలు పెంపు మాత్రం ఏకైక మార్గమని చెబుతోంది. హైదరాబాద్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కారణంగా కొంత నష్టాల్లోకి వెళ్లిందని కొంతమంది చెబుతుండగా.. ఏదీ ఏమైనా నష్టాలను భర్తీ చేసుందుకు సామాన్య ప్రజలపై భారం వేయడం కరెక్టు కాదని మెట్రో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.