Published On:

Fire Accident in Hyderabad: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

Fire Accident in Hyderabad: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

Deputy CM Bhatti Vikramarka Ex Gratio for Fire Accident in Hyderabad: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఉస్మానియా మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడారు. అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు.

 

ఖమ్మం జిల్లా మధిర నుంచి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజా నరసింహతో కలిసి పరిస్థితిని సమీక్షించామన్నారు. అనంరతం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటన సంబంధించిన వివరాలను కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.

 

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రిమండలి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని వైద్య బృందంతో సమీక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూశారని చెప్పారు. ప్రాథమిక విచారణలో ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి: