Last Updated:

TSPSC : నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఈసారి నిబంధనలు కఠినతరం

నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.  ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల

TSPSC : నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఈసారి నిబంధనలు కఠినతరం

TSPSC : నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.  ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల వరకే గ్రూప్‌-1 పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుంది.

ఈ గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేయగా..  3,80,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించగా ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్లీ జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో నేడు మళ్ళీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షల కొరకు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో 994 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు సిద్ధం చేశారు.

ఈసారి నిబంధనలు కఠినతరం (TSPSC)..

పేపర్‌ లీకేజీ నేపథ్యంలో ఈసారి నిబంధనలు మరింత కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో ప్రశ్నలు రూపొందించారు.

  • ముందుగా మెటల్‌ డిటెక్టర్‌తో పరిశీలించి లోపలికి పంపుతారు.
  • అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్‌ స్పష్టం చేసింది.
  • తాళిబొట్టు మినహా ఇతర ఆభరణాలేమైనా ధరిస్తే అక్కడే తీయిస్తారు.
  • అలాగే హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా? సరిగా ముద్రణ కాకపోయినా? గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ తీసుకోవాలి.
  • పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, ఆ ధార్‌ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరని స్పష్టం చేశారు.
  • నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలని సూచించారు.
  • జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదన్నారు.
  • వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేస్తే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
  • పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ పరీక్షలకు గాను అథారిటీ ఆఫీసర్లుగా జిల్లా కలెక్టర్లను, చీఫ్ కో ఆర్డినేటర్లుగా సబ్ కలెక్టర్‌లను ప్రభుత్వం నియమించింది. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా 1995 మంది అధికారులు వ్యవహరించనున్నారు. వీరికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేసింది.