Published On:

Fire Accident in Hyderabad: పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

Fire Accident in Hyderabad: పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

A terrible fire accident in the old town How it happened in Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులుగా గుర్తించారు. మీర్​చౌక్​లోని గుల్జార్​ హౌస్​లో జరిగిన అగ్నిప్రమాదంపై అధికారులు ఆరా తీశారు. తొలుత భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ మంటలు కృష్ణ పెరల్స్‌, మోదీ పెరల్స్‌ షాపుల్లోకి వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14 మంది మృతి చెందారు.

 

అయితే, ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 6.16 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిందన్నారు. అక్కడ భవనం మూడు అంతస్తులు ఉండగా.. తొలుత గ్రౌండ్ ప్లోర్లో మంటలు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే మొదటి అంతస్తులో ఇరుక్కున్న 17 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

 

ఇదిలా ఉండగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే, ఇంటిలో ఓ చెక్కతో ప్యానెళ్లు చేశారు. దీని కారణంగా మంటలు ఎక్కువగా వచ్చాయని అగ్నిమాపక శాక డీజీ నాగిరెడ్డి వివరించారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే చెక్కలు అంటుకొని మంటలు ఎగిసిపడినట్లు తెలిపారు.  కాగా, కింద ప్లోర్‌లో షాపు ఉండగా.. మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. మొత్తం నాలుగు కుటుంబాలు అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. గ్రైండ్ ప్లోర్‌లో నగల దుకాణం నిర్వహిస్తుండగా..వేసవి సెలవులు ఉన్నందున బంధువులు వచ్చారు. అయితే మంటలు చెలరేగి పొగ వ్యాపించడంతో ఊపిరాడక స్పృహ తప్పిపడిపోయారు.