1st Covid Case in Telangana: తెలంగాణలో తొలి కరోనా కేసు.. కూకట్పల్లిలో డాక్టర్కు పాజిటివ్

First Covid-19 Case in Telangana: యావత్ ప్రపంచాన్ని వైరస్తో వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో నాలుగు రోజులుగా అక్కడక్కడ కరోనా మాట వినిపిస్తున్నది. తాజాగా తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలోని విశాఖపట్నంలో కొవిడ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ (కొవిడ్-19) తెలంగాణలో మొదటిసారిగా 2020 మార్చి 2వ తేదీన తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు లక్షల్లో నమోదు కావడంతో రెండుసార్లు లాక్ డౌన్ విధించారు. దీంతో జన జీవనం స్తంభంచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికా కరోనాతో కకావికలమైంది. ఎటు చూసినా శవాల కుప్పలు దర్శనం ఇచ్చాయి.