Vizianagaram: ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు కాదు.. ఆరుగురు ముఠా!

Vizianagaram Conspiracy Case Key Facts Six Members Plan Bomb Attack In Hyderabad: విజయనగరం ఉగ్ర కుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో నిందితులు సిరాజ్, సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు నిందితులను తరలించారు.
ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు తెలిసింది. వీరిద్దరూ హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేశారు. ఇన్స్టా, టెలిగ్రామ్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు గ్రూప్ క్రియేట్ చేశారు. ఇందులో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన యువకులు ఉన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్లో 3 రోజులపాటు కలిసి ఉన్నారు.
అయితే ఐసిస్ ఆదేశాలను అమలు చేయడంపై మీటింగ్ నిర్వహించుకున్నారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే సిరాజ్.. అమెజాన్లో టిఫిన్ బాక్స్లు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేశాడు. మిగతా నలుగురికి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాల్లో గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్లో సమీర్ అరెస్ట్ చేశారు. ఇద్దరికీ విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు.