Published On:

Andhra Pradesh: కడపలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు అరెస్ట్

Andhra Pradesh: కడపలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు అరెస్ట్

Andhra Pradesh: కడప నగరంలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాజీవ్ పార్కు సమీపంలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వారు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అసదుల్లా, ఓవాస్ గా తెలిపారు. భారత్‌కు వచ్చి ఐదేళ్లు అవుతుందని.. నంద్యాలలో కొంతకాలం ఉన్న వారు.. రెండు నెలల క్రితం కడపకు వచ్చినట్టు చెప్పారు. కడపలో ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. పోలీసులు ఎంబసీకి రిపోర్టు పంపనున్నారు. తర్వాత వారి దేశానికి తరలించనున్నట్టు సమాచారం.

 

పహల్గాం దాడి తర్వాత తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే అన్ని నగరాలలో అనుమానాస్పంగా కనిపించిన వ్యక్తులను ఆరాతీస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ పాకిస్తాన్ పై భీకరదాడి చేసిన సంగతి తెలిసిందే. ముందు పాకిస్తాన్ ప్రధాని తమ దేశంలో ఎలాంటి దాడులు జరగలేదని చెప్పారు. ఆతర్వాత భారత్ చేసిన దాడిలో పాక్ లోని ఎయిర్ బేస్ లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఒప్పుకున్నారు.

 

ఇవి కూడా చదవండి: