Published On:

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి 500 ఎకరాలు కేటాయింపు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి 500 ఎకరాలు కేటాయింపు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Government 500 ఓcres allocated to Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఏవియేషన్‌ హబ్‌ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఏఎల్‌ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 1,733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి ఎయిర్ పోర్టు అనుసంధానానికి 92 ఎకరాల మేర ప్రతిపాదన చేశారు. ఎయిర్ పోర్టులో కార్గో ఏరియాకు 83.5 ఎకరాలు, నార్త్‌ టెర్మినల్‌ భవనానికి 98 ఎకరాలు, విమానాశ్రయం బౌండరీ కోసం 494 ఎకరాలు ప్రతిపాదించారు. నివాస ప్రాంతం, ఇతర అవసరాలకు 201 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

మూడు దశల్లో నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌..

ప్రతి సంవత్సరం 36 మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా మూడు ఫేజ్‌ల్లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. దీని ప్రకారం 2,703 ఎకరాలు కేటాయించాల్సి ఉన్నా వైసీపీ ప్రభుత్వం 2,203 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ప్రాజెక్టు వయబిలిటీతో పాటు భవిష్యత్‌ అవసరాలు, సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: