Last Updated:

Nandyal Murder: పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

Nandyal Murder: పాణ్యం మండలంలో జరిగిన పరువు హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. కన్న తండ్రే కుమార్తెను కిరాతకంగా హతమార్చాడు. తల, మొండెం వేరు చేసి అటవీ ప్రాంతంలోని లోయలో పడేశాడు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Nandyal Murder: పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

Nandyal Murder: ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం.. తల, మెుండెం వేరు చేశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.

కారులో మృతదేహం తరలింపు.. (Nandyal Murder)

పాణ్యం మండలంలో జరిగిన పరువు హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. కన్న తండ్రే కుమార్తెను కిరాతకంగా హతమార్చాడు. తల, మొండెం వేరు చేసి అటవీ ప్రాంతంలోని లోయలో పడేశాడు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తరలించడంలో స్థానిక వైకాపా నేత ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వ్యాపించాయి. ఆ నేతను.. గడివేముల పోలీసుస్టేషన్‌ కు తరలించినట్లు స్థానికులు అంటున్నారు.

హత్య అనంతరం ఆ నేత కారులోనే మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి మృతురాలి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంట్లో ప్రసన్నను హత్య చేశాకా.. మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లారు. ఎవరేవరు తీసుకెళ్లారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తన కూతురు వేరే కులం వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. సమయం వృదా చేయకుండా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన ఆ యువతి.. తప్పటడుగులు వేసింది. పెళ్లయిన కూడా.. ప్రియుడికి దగ్గరైంది. ప్రియుడిపై మోజుతో.. భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. తమ కుమార్తె భర్తను వదిలేసి పుట్టింటికి రావడంతో ఆ తండ్రి బాధతో తల్లడిల్లిపోయాడు. కూతురు చేసిన పనికి.. పరువు పోయిందని భావించాడు. కూతురు కన్న పరువే ముఖ్యం అని భావించాడు. కూతురిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి విసిరేశాడు.

పెళ్లయినా ప్రియుడితో సంబంధం..

పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్నకు రెండేళ్ల కిందట వివాహం చేశారు. కూతురు, అల్లుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించేది. ఇది గమనించిన తండ్రి వెంటనే వివాహం జరిపించాడు. పెళ్లైన కూడా ప్రియుడితో స్వప్న సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి.. పుట్టింటి వద్దే ఉంటోంది. తిరిగి భర్త వద్దకు వెళ్లాలని తండ్రి పలుమార్లు సూచించాడు. ఎంత సర్ధిచెప్పిన వినకపోవడంతో కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. కూతురు చేసిన పనితో పరువు పోయిందని భావించాడు. దీంతో కూతురిని హత్య చేశాడు. పెళ్లి తర్వాత.. అన్ని మర్చిపోయి కూతురు సంతోషంగా ఉంటుందని తండ్రి అనుకున్నాడు. ఈ బాధను తట్టుకోలేక హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.