Secundrabad: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

Secundrabad: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజు థియేటర్ సమీపంలోని జేకె ఫర్నిచర్స్ దుకాణం వద్ద ఫుట్పాత్ పై నివసిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తి గ్రానైట్ రాయితో కొట్టి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందా..? లేదా మరిమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.