Last Updated:

Nagarjuna: ఆ సినిమా చూస్తూ కన్నీరు పెట్టుకున్న కింగ్ నాగార్జున

యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్‌ ను వేగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ షో వేశారు. మూవీ చూసిన టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారంటా... తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశానని ఆయన తెలిపారు.

Nagarjuna: ఆ సినిమా చూస్తూ కన్నీరు పెట్టుకున్న కింగ్ నాగార్జున

Nagarjuna: యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం‘. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్‌ ను వేగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ షో వేశారు. మూవీ చూసిన టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారంటా… తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశానని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో అక్కినేని అమల, శర్వానంద్ తల్లీకొడుకుగా నటించారు. శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్‌ కానుంది.

‘ఒకే ఒక జీవితం చిత్రం కుటుంబ సమేతంగా అందరూ చూడదగిన చిత్రం అని దర్శకుడు సినిమాను చాలా అందంగా తీశారని కింగ్ నాగార్జున చెప్పుకొచ్చారు. తల్లి సెంటిమెంట్‌ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం చూసిన వారుఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారని… నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చి థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నానని ఆయన తెలిపారు. ప్రీమియర్‌ షో చూసిన నాగార్జున ‘ఒకే ఒక జీవితం’ చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం నాగ్ కన్నీరు పెట్టుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి: