Published On:

10% Discount on Metro Charges: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే మెట్రో కొత్త ఛార్జీలు!

10% Discount on Metro Charges: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే మెట్రో కొత్త ఛార్జీలు!

Hyderabad Metro Rail announced 10 % discount on Tickets: మెట్రో ప్రయాణికులు గుడ్ న్యూస్. కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలులో ఛార్జీలను కనీసం రూ.10 నుంచి రూ.12కు పెంచగా.. అత్యధికంగా రూ.60 నుంచి రూ.75 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెంచిన ఛార్జీలపై మరోసారి పరిశీలించి 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.

ఈ మేరకు తగ్గిన ఛార్జీలను పరిశీలిస్తే.. కనీసం రూ.12 నుంచి రూ.11 వరకు తగ్గగా.. గరిష్టంగా రూ.75 నుంచి రూ.69 వరకు తగ్గించింది. అయితే కొన్ని జోన్లలో 10శాతం కంటే తక్కువగా చూపించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రాయితీ అన్ని రకాల టికెట్లకు అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: