Last Updated:

Rahul Gandhi: చైనా ఆక్రమించిన వెయ్యి కి.మీ

భారత్ జోడో యాత్రతో భాజపాకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు మోదీపై విమర్శలు గుప్పించారు

Rahul Gandhi: చైనా ఆక్రమించిన వెయ్యి కి.మీ

Rahul Gandhi: ఈమేరకు రాహుల్ బుధవారం తన ట్విట్టర్ ద్వారా మోదీని ప్రశ్నించారు. భారత భూభాగాన్ని చైనా వెయ్యి కి.మీ మేర ఆక్రమించిందన్నారు. 2020కు ముందున్న స్టేటస్ కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందన్నారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలన్నారు. వెయ్యి కి.మి. మేర మోదీనే చైనాకు అప్పగించారంటూ సంచలన ఆరోపణలు రాహుల్ చేసారు.

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ కేరళలో చురుగ్గా పాదయాత్ర కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు. భాజపాపై విమర్శనాస్త్రాలు చేపడుతూనే తన జోడో యాత్రను రాహుల్ సాగిస్తున్నారు. ఆయన యాత్రకు ప్రజల నుండి అశేష స్పందన వస్తుండడంతో భాజపా అగ్రనేతలు ఒకింత ఆందోళనలకు గురౌతున్నారు.

ఇవి కూడా చదవండి: