India Pakistan War: పాక్, భారత్కు అమెరికా ఫోన్.. వివాదానికి సహకరిస్తామని సూచన!

US Secretary Marco Rubio dials Pakistan, Indian to Stop War: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఈ మేరకు ఆయనతో భారత్, పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయంలో భారత్, పాక్ మధ్య చర్చలు అనివార్యమని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు మార్కో రేబియో తెలిపారు.
అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఈ మేరకు భారత్, పాక్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలని సూచించారు. రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలని, వివాదాలు తలెత్తకుండా అవసరమైతే ఇరు దేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదించారు.
కాగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడిన అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశాడు. భారత వైఖరి ఎప్పుడూ శాంతియుతంగా, బాధ్యతతో ఉంటుందన్నారు. ఇప్పటికీ అదే కొనసాగుతోందని పేర్కొన్నారు.