Published On:

2 Ships Sank: మయన్మార్‌లో ఓడలు మునిగి 427 మంది రోహింగ్యాలు మృతి?

2 Ships Sank: మయన్మార్‌లో ఓడలు మునిగి 427 మంది రోహింగ్యాలు మృతి?

427 Rohingya Died in 2 Ships Sank off the Coast of Myanmar: మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐరాస అంచనా వేసింది. విషయం నిర్దారణ అయితే సముద్రంలో చోటుచేసుకున్న అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

 

మే 9, 10 తేదీల్లో ప్రమాదాలు..

ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. మొదటి ప్రమాదం ఈ నెల 9వ తేదీన జరుగగా, 267 మందిలో 66 మంది బతికారని ప్రాథమికంగా వెల్లడించింది. ఈ నెల 10వ తేదీన రెండో నౌక ప్రమాదానికి గురికాగా, 21 మంది బతికి బయటపడ్డారని సమాచారం.

 

మయన్మార్‌లో రోహింగ్యాలు నివాసం..

వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌లో నివసిస్తుంటారు. కానీ, సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకుగాను లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లా‌కు తరలిపోయారు. మయన్మార్‌లో గతేడాది సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత వారి వలసలు మరింత పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అక్కడి పరిస్థితులు క్షీణించడంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: