Published On:

Pakistan: రెండోసారి క్షిపణిని ప్రయోగించిన పాక్

Pakistan: రెండోసారి క్షిపణిని ప్రయోగించిన పాక్

 

Pakistan: పాకిస్థాన్‌ రెండోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. తాజాగా 120 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. తొలిసారి 450 కిలోమీటర్ల రేంజ్‌ క్షిపణిని పాక్‌ ప్రయోగించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన ప్రకారం, ఈ క్షిపణి పరీక్ష అధునాతన నావిగేషన్ వ్యవస్థ మరియు మెరుగైన ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ఉద్దేశించబడింది.

 

రెండు అణ్వాయుధ దేశాల మధ్య పెరిగిన శత్రుత్వాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి క్షిపణి పరీక్ష వరకు వచ్చింది. ఏప్రిల్ 22న, పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఎక్కువ మంది పర్యాటకులు, ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఇది ఒకటి. ఈ విషయంపై ఇప్పటికే భారత్ దౌత్యపరమైన ఆంక్షలు పాకిస్థాన్ పై విధించింది. సింధూజలాలను, పాకిస్థాన్ జాతీయులకు వీసాలను నిలిపివేయడం చేసింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి దిగుమతునైనా నిషేదించింది.

 

ఈ క్షిపణి పరీక్ష క్షిపణి యొక్క అధునాతన నావిగేషన్ వ్యవస్థ మరియు మెరుగైన ఖచ్చితత్వంతో సహా కార్యాచరణ సంసిద్ధతను మరియు కీలక సాంకేతిక సామర్థ్యాలను ధృవీకరించడానికి ఉద్దేశించబడింది. శనివారం 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఉపరితలం నుండి ఉపరితలం వరకు బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది.

 

ఇదిలా ఉండగా పాకిస్థాన్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు ప్రారంభించింది. ఇప్పటికి 11రోజులు అవుతుంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వరుసగా త్రివిధ ధళాల అధిపతులతో మోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితులను గమనిస్తున్న పాకిస్థాన్ అప్రమత్తంగా ఉంది. ఇదిలా ఉంటే భారత్ మాత్రం సైనిక చర్యలు చేస్తూ సమయాన్ని వృధా చేయడంలేదు.