Pakistan: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్.. సాక్ష్యాలతో సహా దొరికిపోయారుగా

Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతివ్వంలేదని ఇన్నాళ్లు చెప్తూ వస్తోంది. ఈ విషయమై పలు అంతర్జాతీయ వేదికలపై తన స్వరాన్ని వినిపించినా ఎవ్వరూ నమ్మలేదు. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ దాడిలో మరణించిన ఉగ్రవాది యాకుబ్ మొఘల్ అంత్యక్రియల్లో పాకిస్తాన్ పోలీసులు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతేకాకుండా చనిపోయిన ఉగ్రవాది శవంపై పాకిస్తాన్ జెండాను ఉంచడం, అలాగే మొఘల్ అంత్యక్రియలను ఘనంగా నిర్వహించడంపై.. పాకిస్తాన్ అధికారికంగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే విషయం బయట పడిందని భారత అధికారులు అంటున్నారు. అయితే భారత్ జరిపిన దాడులకు తగిన విధంగా జవాబిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనడంపై ఆ దేశం ఉగ్రవాదులకు సహకరిస్తోందని తేట తెల్లమవుతోంది. మరోవైపు భారత్ ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబీకులు, స్నేహితులు కలిపి 14 మంది మరణించారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.