Sandhya Theatre Case: సంధ్య థియేటర్ ఘటన.. ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్

Sandhya Theatre Incident Boy Sritej Discharged From Hospital: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నాడు. బుధవారం (ఏప్రిల్ 30) బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. కాగా గతేడాది పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి 5నెలలుగా శ్రీతేజ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
కొన్ని రోజుల పాటు వెంటిలెటర్పై ఉన్న అతడు మెల్లిమెల్లిగా కోలుకున్న అతడి ఇవాళ డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి నోటి ద్వారా లిక్వెడ్స్ తీసుకుంటున్నట్టు అతడి తండ్రి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ అతడు మనుషులను గుర్తు పట్టడం లేదట. శ్రీతేజ్కి 15 రోజుల పాటు ఫిజియోథెరపి చేయించి ఇంటికి తీసుకువెళ్లోచ్చని వైద్యులు సూచించారు. కాగా పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో డిసెంబర్ 4న వేసిన బెనిఫిట్ షో చూసేందుకు శ్రీతేజ్ ఫ్యామిలీ అంతా సంధ్య థియేటర్కు వచ్చింది.
అప్పుడే మూవీ చూసేందుకు హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. దీంతో బన్నీ చూసేందుకు జనాలు ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన శ్రీతేజ్ తల్లి రేవతి మరణించగా.. బాలుడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారడు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో 4 నెలల 25 రోజులుగా శ్రీతేజ్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ నేడు డిశ్చార్జ్ అవుతుండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బన్నీ అరెస్టై జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.