Last Updated:

Droupadi Murmu: ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.

Droupadi Murmu: ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 4న ఢిల్లీ నుంచి ఆమె విజయవాడ చేరుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వివరాలను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా వెల్లడించారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము బయలుదేరి ఉదయం 10:15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి తాడిగడప పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ముర్ము హజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏపీ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ సన్మానిస్తారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ఆమె పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం విశాఖలో జరిగే నేవీ డే ఉత్సవాలలో ఆమె పాల్గొంటారు. ఇదే వేదికపై నుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు రాష్ట్రపతి.

ఇదీ చదవండి: ఇంకో 6 నెలల్లో పచ్చ పార్టీ ముక్క చెక్కలవుతుంది.. ఎంపీ విజయసాయిరెడ్డి

ఇవి కూడా చదవండి: