32 Airports Re-opened: మళ్లీ తెరుచుకున్న 32 విమానాశ్రయాలు.. రాకపోకలు ప్రారంభం!

Indian Airspace Key Announcement, 32 airports to reopen: విమాన ప్రయాణికులు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు మూసివేయాలని భావించినా.. కాల్పుల విరమణ కారణంగా మళ్లీ తెరిచారు. ఈ మేరకు పౌరవిమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సంస్థల వెబ్ సైట్లు పరిశీలించాలని సూచించింది.
అంతకుముందు, పాక్, భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొనడంతో భారత ఎయిర్ లైన్స్ ముందస్తుగా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశాయి.పాక్ సరిహద్దుల్లో ఉన్న ప్రధాన ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేయాలని ఐఏఎఫ్ సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కాగా, దీంతో ఎక్కువగా అమృత్ సర్ వంటి విమానాశ్రయాల్లో ప్రభావం తీవ్రంగా పడింది.
మళ్లీ విమానాశ్రయాలు తిరిగి ప్రారంభం కావడంతో దూరప్రదేశాలు వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అన్ని విమానాశ్రయాలు ప్రారంభం కావడంతో కొంత ఊరట కలిగింది. ఇప్పటికే విమాన రాకపోకల విషయాలపై పైలట్లకు, సిబ్బందికి సమాచారం తెలియజేశారు.