Pak Accepted Pulwama attack in 2019: పుల్వామా దాడి మా పనే.. నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ ఆర్మీ

Pakistan Accepted that Pak army is behind on Pulwama Attack in 2019: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. జమ్మూ పర్యాటనకు వచ్చిన 26 మంది అమాయకులను జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం కావడంతో పాటు. 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. దీంతో పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేయడం ప్రారంభించింది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరిపింది. అయితే భారత ఆర్మీ రక్షణ వ్యవస్థ దాడులను ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు పాకిస్తాన్ లోని సైనిక, ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ కు తీవ్రంగా నష్టం ఏర్పడింది.
మరోవైపు భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. ఎయిర్ పోర్టులు, ప్రార్థనా మందిరాలు, ఆర్మీ బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో 16 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి భారత్ పూర్తిస్థాయిలో పాకిస్తాన్ పై దాడులకు దిగింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ చేశారు. ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
అయితే అసలే ఆర్థిక పరిస్థితి బాగలేని పాకిస్తాన్ కాల్పుల విరమణ చేద్దామని కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలతో ఇరుదేశాల కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు నిన్న మధ్యాహ్నం కాల్పుల విరమణకు తమ దేశం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు కాల్ చేశారు. మరోవైపు కాల్పుల విరమణ చేస్తున్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు ఇరుదేశాలు ప్రకటించాయి. కానీ పాక్ మాత్రం తన వంకర బుద్ధిని చూపించింది. భారత్ పై మళ్లీ దాడులు చేసింది. వీటిని భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. ప్రతిగా పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో దాడులు చేసింది.
అయితే 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిపై పాక్ ఆర్మీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్ లోని ఆర్మీ కాన్వాయ్ పై బాంబు దాడి జరగడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడగా.. అప్పట్లో పాక్ దీనిని ఒప్పుకోలేదు. దాడితో తమకు సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చింది. తాజాగా పుల్వామా దాడి తామే చేశామని పాకిస్తాన్ అసలు నిజం చెప్పింది.
పాక్ త్రివిధ దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పలు దేశాల రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే పుల్వామా అటాక్ లో తమ హస్తం ఉందని అందరి ముందే ఆ దేశ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబు అహ్మద్ బయటపెట్టారు. అయితే పాకిస్తాన్ జలాలు, భూభాగం, గగనతలానికి ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే తాము సహించబోమని హెచ్చరించారు. అలాంటి చర్యలను ఉపేక్షించమని చెప్పారు. ఈ విషయాన్ని పుల్వామా ఘటనతో తాము నిరూపించామని చెప్పారు. దీంతో పాక్ చేసిన తప్పులు బయటపడుతున్నాయని, వారిని వదలొద్దని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Pulwama terrorist attack was our tactical brilliance: Pakistan
Dear world, this is the reality of Pakistan — they have openly admitted their involvement in a terror attack that killed 40 Indian soldiers.. pic.twitter.com/YQvvF82xi1
— Mr Sinha (@MrSinha_) May 10, 2025