Operation Sindoor: నేడు అఖిలపక్ష సమావేశం.. ఆపరేషన్ సిందూర్ పై వివరణ!

Operation Sindoor: కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు అంతా సిద్దం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్థాన్తో పాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్థాన్ ఎన్ని కవింపు చర్యలు చేసిన భారత్ కు తిప్పి కొట్టే సమర్ధత ఉందని మాజీ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సజ్జ సునీల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయినందుకు భారత్ సరైన గుణపాఠం చెప్పిందన్నారు. కాశ్మీర్ యొక్క ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీయడానికి ఇలాంటి పనులు చేస్తుందని, భవిష్యత్తులో పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు మాజీ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సజ్జ సునీల్.
ఆపరేషన్ సిందూర్పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్పై రాజమండ్రి సిటీ ఎమ్మల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు త్రీవ్రంగా స్పందించారు. పహల్గాం ఘటనకు ప్రతిచర్యగా పాకిస్థాన్ తీవ్రవాద ముష్కర్లకు ప్రధాని మోదీ రుచి చూపించారన్నారు. ఆపరేషన్ సిందూర్కు కంటిన్యూ ఉంటుందన్నారు. భారత్ త్రివిధ దళాలు దేశ వీరత్వాన్ని పాకిస్థాన్ దుండగులను మట్టుబెట్టడం ద్వారా చాటి చెప్పేయని అంటున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
హైదరాబాద్లోని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పాకిస్తాన్ జెండాకు చెప్పుల దండ, వేసి కోడిగుడ్లతో కొట్టారు. పాకిస్తాన్ జాతీయ జెండాను రోడ్డుపై తొక్కుతూ భారత సైన్యం సాధించిన విజయాన్ని గర్విస్తూ పటాసులు కాల్చారు.
పాకిస్తాన్ చేసే దాడికి ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని ఆకుల శ్రీ వాణీ హెచ్చరించారు. భవిష్యత్తులో ఏ దేశమైన దాడి చేయాలంటే భయపడాలన్నారు. భారతదేశ ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపిన ఉగ్రవాదులకు ఇక చుక్కలే కనపడతాయన్నారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి చూసి ఉగ్రవాదులు వనికిపోతున్నారని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు.