Nandamuri Balakrishna: ‘పద్మ భూషణ్’ అవార్డుపై స్పందించిన బాలయ్య – ఏమన్నారంటే!

Nandamuri Balakrishna Comments on Padma Bhushan Award: ‘సరైన సమయంలోనే నాకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది’ అని సినీ నటుడు, హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలక్రష్ణ ఆనందం వ్యక్తం చేశారు. నిన్న ఏప్రిల్ 28న ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానొత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.
ఈ పురస్కార ప్రదానొత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ భుషణ్ అవార్డును వరించడం చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్న. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. నిజానికి నాకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. కానీ వారికి నా సమాధానం ఒక్కటే. నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చింది. నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా నా సినీ కెరీర్ ప్రారంభంచి 50 ఏళ్లు పూర్తయ్యింది. నాకేంతో ప్రత్యేమైన ఈ ఏడాదిలోనే పద్మ భూషణ్ రావడం మరింత ప్రత్యేకమైంది” ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది గణతంత్ర్య దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 139 మందికి ఈ పద్మ అవార్డులు వరించాయి. ఏడుగురు పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. బాలయ్యతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, నటి శోభనతో పాటు పలువురి పద్మ భూషణ్ అవార్డు వరించింది.
ఇవి కూడా చదవండి:
- Mahesh Babu Latest Look: SSMB29లో మహేష్ బాబు కొత్త లుక్ లీక్ – సింహాన్ని క్లోజప్లో చూస్తున్నట్టే ఉంది..