Last Updated:

నాగ్‌పూర్‌: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పసిబిడ్డతో వచ్చిన ఎమ్మెల్యే

నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.

నాగ్‌పూర్‌: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పసిబిడ్డతో వచ్చిన ఎమ్మెల్యే

Nagpur: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. సెప్టెంబర్ 30న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.కోవిడ్ కారణంగా నాగ్‌పూర్‌లో గత రెండున్నర సంవత్సరాలుగా ఎటువంటి సెషన్ నిర్వహించలేదు. నేను ఇప్పుడు తల్లిని కానీ నా ఓటర్లకు సమాధానాలు చెప్పడానికి వచ్చానని ఆమె తెలిపారు.

మహారాష్ట్రలోని డియోలాలి అసెంబ్లీకి చెందిన ఈ ఎమ్మెల్యే తన రెండున్నర నెలల శిశువును సమావేశానికి తీసుకువెళుతున్న వీడియో క్లిప్‌లలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యింది.గతంలో 2013లో హైదరాబాద్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే చంద్రకళ కూడా తన నవజాత శిశువుతో కలిసి సమావేశాలకు హాజరయింది.

మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సెషన్‌కు ముందు, ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ మంత్రులపై దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్‌ను అనుమతించే కొత్త అవినీతి నిరోధక లోకాయుక్త చట్టాన్ని రూపొందించే బిల్లును సిఎం ఆమోదించారు.లోకాయుక్త యొక్క ఐదుగురు సభ్యుల బెంచ్‌కు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. మరో ఇద్దరు రిటైర్డ్ జడ్జీలు ఉంటారు.కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావనకు రానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను అసెంబ్లీలో ఆమోదించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు.

ఇవి కూడా చదవండి: