Home / Telangana
Miss World 2025 Contest Starts from Today in Hyderabad: అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడులకను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ […]
Pakistan does not Deserve to be called Islam said by Asaduddin: పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దాడుల విషయంలో పాక్ మజాక్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని […]
Cracker Banned in Hyderabad amid India – Pakistan War: భారత్- పాక్ మధ్య జరుగుతున్న దాడులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, పబ్లిక్ ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతి భద్రతలు కాపాడేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు కీలక అలర్ట్ ఇచ్చారు. సిటీ పరిధిలో బాణసంచా కాల్చడంపై […]
Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని షేక్పేటలో ఏపీఏహెచ్సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]
Accident on the Hyderabad Outer Ring Road: పెద్దఅంబర్పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టిగా, మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరొకరిని మంటల […]
Operation Kagar is on Hold amid Operation Sindoor: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్పై ‘ఆపరేషన్ సిందూర్‘ ఎఫెక్ట్ పడింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మావోల ఏరివేతకు కర్రెగుట్టను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోల వేటకు బ్రేక్ పడింది. […]
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఈవెంట్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందాల భామలు పోటీలో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అతిథులకు, పోటీదారులకు నగరంలోని పలు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అలాగే ఆయా హోటళ్ల వద్ద భారీ భద్రత కల్పించారు. […]
Telangana: భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక దళాలు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిసైళ్లతో భారత్ పై దాడులు చేస్తోంది. కాగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చెందిన మిస్సైళ్లను నేలమట్టం చేస్తోంది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ సైన్యాలకు కాల్పులకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక భారత్- […]
Shamshabad Airport : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వేళ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. విమానాశ్రయంలో బాంబు పెట్టమంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణను పెంచారు. 24గంటల పాటు డేగ కన్నుతో ఎయిర్ పోర్టుకు […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]