Crackers Ban in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా కాల్చడంపై నిషేధం

Cracker Banned in Hyderabad amid India – Pakistan War: భారత్- పాక్ మధ్య జరుగుతున్న దాడులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, పబ్లిక్ ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతి భద్రతలు కాపాడేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు.
కాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు కీలక అలర్ట్ ఇచ్చారు. సిటీ పరిధిలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుట్టినరోజులు ఇలా వేడుకలు ఏదైనా ఇక నుంచి టపాసులు కాల్చొద్దని హెచ్చరించారు. అలాగే టపాసుల అమ్మకంపై కూడా నిషేధం పెట్టారు. ఈ మేరకు బాణసంచా వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ కూడా టపాసులు కాల్చొద్దని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
కాగా దేశంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయది దేశం డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు టపాసులు వినియోగించడం వల్ల ప్రజలు ఏవి టపాసులో, ఏవి బాంబులో నిర్ధారించుకోలేక ఆందోళన చెందే అవకాశం ఉంది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు కలిగొచ్చనే ఉద్దేశంతో అధికారులు టపాసుల వాడకంపై నిషేధం విధించారు.