Home / Telangana
Supreme court : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన […]
KCR Met BRS Leaders: బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ సూచిస్తున్నారు. హస్తం పార్టీని తుం చేద్దాం.. గులాబీ పార్టీ […]
High Court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. […]
Bhatti Vikramarka : హెచ్సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై లాఠీఛార్జీ జరగడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడ ఉన్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. […]
Rain Alert for Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు జారీ చేసింది. అదే విధంగా పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో క్యుమలోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయని […]
Airport authority Green Signal For Adilabad Airport: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు స్థాపనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం అనుమతివ్వగా.. తాజాగా మరో ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి […]
LRS Date Extended : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ పథకం రాయితీ గడువును మరోసారి పెంచింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రాయితీ గడువు మార్చి 31తో ముగియగా, మరోసారి గడువును పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గడువును ఈ నెల 30 వరకు పొడగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 30లోగా ఫీజు చెల్లింపు చేసిన వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ […]
Telangana Congress : గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 మూవీ చూసేందుకు థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో అతడిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి తరలించి వైద్యం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను […]
High court : కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హైకోర్టులో దాఖలు చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న కోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది. జీవో 54 తీసుకొచ్చిన ప్రభుత్వం.. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, […]
CM Revanth Reddy Sentational Comments BC Poru Garjana In Delhi: రిజర్వేషన్ల విషయంలో బీసీలు గొంతు వినిపించాలని, అవసరమైతే ధర్మయుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కోర్టులు సైతం స్పష్టంగా చెప్పాయన్నారు. జనాభా తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని […]