Home / lLatest National News
మణిపూర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో త్రిపుర కేడర్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి రాజీవ్ సింగ్ మణిపూర్ కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులయ్యారు
ఒటిటి ప్లాట్ఫారమ్లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తప్పనిసరి చేసింది. మంత్రిత్వ శాఖ యొక్క నోటిఫికేషన్ ప్రచురణకర్తలకు పొగాకు వ్యతిరేక హెచ్చరికల కోసం కొత్త నిబంధనలను నిర్దేశించింది. కొత్త నిబంధనలను పాటించడంలో విఫలమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తనపై వచ్చిన ఆరోపణలు 'చాలా తీవ్రమైనవి' అని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాబినెట్లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం డికె శివకుమార్కు నీటిపారుదల మరియు బెంగళూరు నగరాభివృద్ధి శాఖలను కేటాయించగా ఆర్థిక శాఖను తన వద్ద ఉంచుకున్నారు
ఆదివారం మణిపూర్లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలు మరియు పౌరులపై కాల్పులు జరిపిన సందర్భాల్లో ఒక పోలీసుతో సహా కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈశాన్య రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు భారత సైన్యం కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ప్రారంభమైంది.
తీహార్ జైలులో ఇద్దరు గ్యాంగ్ స్టర్లు ప్రత్యర్దుల దాడిలో మరణించిన తరువాత భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తిన నేపధ్యంలో జైళ్ల శాఖ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా 80 మంది అధికారులను బదిలీ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మరియు ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత వైద్య కారణాలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలులో బాత్రూంలో పడిపోవడంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ గురువారం దేశ రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేరారు.తీహార్ జైలు వాష్రూమ్లో జైన్ కిందపడిపోయాడని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు తెలిపాయి.ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రిని ఆసుపత్రికి తరలించడం గత వారంలో ఇది రెండోసారి.
రైల్వే నెట్వర్క్ను పెంపొందించడానికి భారతదేశం బహుమతిగా ఇచ్చిన 20 బ్రాడ్ గేజ్ రైల్వే లోకోమోటివ్లు మంగళవారం సాయంత్రం బెంగాల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించాయి.నదియాలోని గెడే స్టేషన్ సమీపంలో పార్క్ చేయబడిన, లోకోలు సాయంత్రం ఢిల్లీ నుండి బయలు దేరాయి.
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ బుధవారం నిర్దోషిగా విడుదలయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై గతేడాది అక్టోబర్లో ఇదే కేసులో ఆయన దోషిగా తేలింది.