Home / lLatest National News
రైల్వే నెట్వర్క్ను పెంపొందించడానికి భారతదేశం బహుమతిగా ఇచ్చిన 20 బ్రాడ్ గేజ్ రైల్వే లోకోమోటివ్లు మంగళవారం సాయంత్రం బెంగాల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించాయి.నదియాలోని గెడే స్టేషన్ సమీపంలో పార్క్ చేయబడిన, లోకోలు సాయంత్రం ఢిల్లీ నుండి బయలు దేరాయి.
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ బుధవారం నిర్దోషిగా విడుదలయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై గతేడాది అక్టోబర్లో ఇదే కేసులో ఆయన దోషిగా తేలింది.
కోల్కతాకు చెందిన ఒక లెస్బియన్ జంట సోమవారం సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. హల్దీ, సంగీత్, మెహందీ మరియు ఫెరాస్తో సహా అన్ని సాంప్రదాయ బెంగాలీ ఆచారాలతో వీరి వివాహం జరిగింది.
జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ సాయంత్రం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు క్యాండిల్లైట్ మార్చ్కు పిలుపునిచ్చారు.
ఓ పురుగుమందుల కంపెనీ, మరికొన్ని సంస్థలు నాసిరకం మందులను అందిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని హింగోలిలో స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు సోమవారం రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరి ప్రత్యేక నిరసన చేపట్టారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబయి యూనిట్ మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ను జూన్ 8 వరకు అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.వాంఖడేకు ఉపశమనం కల్పించే ముందు హైకోర్టు కొన్ని షరతులు విధించింది.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో తాజాగా ఘర్షణలు చెలరేగడంతో సైన్యం మరియు పారామిలటరీ బలగాలను మోహరించారు ఇంఫాల్లోని న్యూ చెకాన్ ప్రాంతంలో మెయిటీ మరియు కుకీ కమ్యూనిటీలు ఘర్షణ పడ్డాయి. స్థానిక మార్కెట్లో స్థలం విషయంలో గొడవలు మొదలయ్యాయి.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘జీరో ట్రాఫిక్’ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ఆదివారం బెంగళూరు పోలీసులకు చెప్పారు. ఈ ప్రోటోకాల్ అమలులో ఉన్న మార్గంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన తర్వాత తాను ఈ చర్య తీసుకున్నట్లు సిద్దరామయ్య చెప్పారు.
మహారాష్ట్రలో సామూహిక వివాహాలు చేసుకునే జంటలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10,000 నుంచి రూ.25,000కు పెంచనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు.పాల్ఘర్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో షిండే ఈ ప్రకటన చేసారు.
డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్ను విడుదల చేసేందుకు బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నుండి రూ.25 కోట్లు దోపిడీకి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే షారూఖ్ ఖాన్ తనతో మాట్లాడిన వాట్సాప్ సంభాషణలను బయటపెట్టారు