Home / Latest Internatioinal News
ఖరీదైన హోటళ్ల లో ఖరీదైన భోజనం పీకలదాకా తిని బిల్లు చెల్లించకుండా పారిపోయే బాపతు వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. తాజాగా బ్రిటన్లో ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక జంట ఐదు రెస్టారెంట్లలో ఖరీదైన భోజనం తిని సుమారు వెయ్యి పౌండ్లు వరకు చెల్లించకుండా పారిపోయింది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెండ్స్ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీనితో పాటు దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులను రానివ్వమని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆ దేశ హోంమంత్రి క్లెయిరోనిల్ సోమవారం నాడు చెప్పారు.
సోమాలియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో మరణించిన వారి సంఖ్య 96కి చేరుకుందని రాష్ట్ర వార్తా సంస్థ సోన్నా శనివారం తెలిపింది. సోమాలియా వరద మృతుల సంఖ్య 96కి చేరుకుందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఒక పోస్ట్లో తెలిపారు,ఈ సంఖ్యను ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి మహముద్ మోఅల్లిమ్ ధృవీకరించారు.
ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
గాజా స్ట్రిప్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.
సోమాలియాలోని బెలెడ్వేన్ నగరంలోని భద్రతా తనిఖీ కేంద్రం వద్ద జరిగిన బాంబు దాడిలో కనీసం 18 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. చెక్పాయింట్ వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పేలడంతో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఇది ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు.
భారతీయ-అమెరికన్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి H-1B వీసా ప్రోగ్రామ్ను ఒప్పంద సేవగా పేర్కొన్నారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గగెలిస్తే లాటరీ ఆధారిత వ్యవస్థను రద్దు చేస్తానని దాని స్దానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తీసుకు వస్తానని తెలిపారు.
బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వ్యక్తిలో పంది కిడ్నీ సాధారణంగా రెండు నెలలపాటు పనిచేసి రికార్డు సృష్టించింది.NYU లాంగోన్ హెల్త్లో ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరీ నేతృత్వంలోని ఈ ప్రయోగం బుధవారం ముగిసింది,
అమెరికాలో ఒక తెలుగు విద్యార్ది ప్రమాదంలో మరణిస్తే ఆమె ప్రాణాలకు విలువలేదంటూ హేళనగా మాట్లాడిన పోలీసు అధికారిపై భారతీయులు భగ్గుమంటున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.