Home / latest ap news
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి.. ఇపుడు స్ధానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో రెండు తెలుగు రాష్ట్రాలు మార్మోగుతున్నారు. దూపదీప నైవేధ్యాలు, భజనలతో శివాలయాలు కళకళలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Gang Rape In Konaseema : కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాళ్లు ఆడవారిపై హింసాకాండను కొనసాగిస్తూనే ఉంటున్నారు. చిన్నా, పెద్ద తారతమ్యాలను మరచిపోతూ.. వావివరసాలను సైతం గాలి కొదిలేస్తూ పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనలకు ముగింపు ఎప్పుదు వస్తుందా అని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఆడవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి […]
రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా లింగరాజుపాలెం కస్తుర్భా పాఠశాల విద్యార్థినుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరితో కన్నీరు పెట్టిస్తోంది. మంచిగా చదువు చెబుతారని ఇక్కడ చేరామని.. కానీ ఆ పరిస్థితి లేదంటూ బాలికలు కన్నీటి పర్యంతం అయ్యారు.
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీని వీడిన కన్నా దారెటు అనే ప్రశ్నకు బలంగా వినిపిస్తున్న పేరు టీడీపీ.