Last Updated:

Road Accident : పాడేరులో విషాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. వారిలో 2 మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెట్టు కొమ్మను తప్పించే క్రమంలో అదుపు తప్పిన బస్సు

Road Accident : పాడేరులో విషాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

Road Accident : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. వారిలో 2 మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెట్టు కొమ్మను తప్పించే క్రమంలో అదుపు తప్పిన బస్సు 100 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. చోడవరం నుండి  పాడేరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు కాని వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు లోయలో పడే సమయంలో లోయలో ఉన్న చెట్లు ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాదం జరిగిన స్థలంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడ లేకపోవడంతో ప్రమాదం జరిగిన విషయం బయట ప్రపంచానికి తెలపడానికి సమయం పట్టిందని బాధితులు వాపోతున్నారు. సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ రావడంతో బాధితులు ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేసినట్లు వెల్లడించారు.