Home / Andhrapradesh
Former Minister Ambati Rambabu : ప్రధాని మోదీ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అసత్యాలు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి ఒక అంతులేని కథ అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారని మండిపడ్డారు. అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.41 వేల కోట్లకు పైగా టెండర్లు పిలిచి రూ.5,500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఐదేళ్ల […]
AP CM Chandrababu Naidu : చరిత్రలో ఇవాళ కీలకమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పున:నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను చాలాసార్లు ప్రధాని మోదీని కలిశానని, నిమిషాల కొద్ది మాట్లాడినట్లు గుర్తుచేశారు. కానీ, మొన్న కలిసినప్పుడు మోదీ కళ్లలో ఆవేదన చూశానని చెప్పారు. ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయనే బాధ మోదీలో కనిపించిందన్నారు. మేమంతా మీతో ఉన్నామని ప్రధానికి సీఎం భరోసా ఇచ్చాడు. ఉగ్రదాడి విషయంలో ఏ […]
PM Modi : రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, […]
AP Police restrictions : ఏపీలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 2న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అమరావతి పరిధిలో ఎగరవేతపై నిషేధం విధించారు. ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేపు ఏపీ ప్రధాని రాక.. ప్రధాని మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభించనున్నారు. సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్టుకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. […]
Pawan Kalyan face-to-face with workers : శ్రామికులు లేకపోతే దేశ నిర్మాణం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మే డే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదని, ఉపాధి శ్రామికులని పిలుస్తామని హామీనిచ్చారు. శ్రామికుల మాటలు వింటే ఎంతో ఆనందం కలిగిందన్నారు. తాము కూడా చిన్నప్పుడు మూడెకరాల భూమిని అమ్ముకున్నట్లు వివరించారు. పాతికేళ్ల కింద ఎనిమిదెకరాల […]
Tirupati : తిరుపతి సమీపంలోని మంగళం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నం-63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు (40), ఒంగోలుకు చెందిన వసంత్, కె.శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ […]
AP ECET-2025 : జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మే 6న ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు విడుతలుగా పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మెదటి విడుత, మధ్యాహ్నం 2 నుంచి సాయంంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం […]
Pawan Kalyan donates Rs.50 lakhs : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జమ్ముకాశ్మీర్లోని పవాల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సోమిశెట్టి కుటుంబానికి పవన్ జనసేన పార్టీ తరఫున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో పహల్గాం అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పవన్ […]
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యపభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించారు. మరోవైపు ఈ స్థానం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తమిళనాడుకు […]
Tirupati Road Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు […]