Home / Andhrapradesh
Araku Coffee Stalls : ఏపీలోని అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఇవాళ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఆదేశాలతో రెండు స్టాళ్ల ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగం 1, 2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్ల […]
Vidadala Rajini : గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని ఇవాళ మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని ఆరోపణలు చేశారు. ఎంపీ వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం, తన మరిదిని కూడా వివాదంలోకి […]
Botsa Satyanarayana: విశాఖలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నాయి. ప్లాన్ను తిప్పికొట్టేందుకు వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన మేయర్ను పదవి నుంచి […]
BJP : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు కూడా రాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు 150 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు […]
Chandragiri : తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తలు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్చార్జి దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. […]
AP New DGP : ఏపీ ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్రెడ్డి, హరీశ్కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి పంపించింది. ఇందులో మూడు పేర్లు ఎంపిక చేసి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్చార్జి డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు […]
Chandrababu : ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర పథకాలు, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు […]
AP Deputy CM : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామంలో ఏపీ ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి గడ్డపార పట్టి గుంత తవ్వి […]
Manda krishna Madiga : ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు నాయుడిదే కీలక పాత్ర అన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత బాబుదేనన్నారు. ఈ విజయం 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ ఉద్యమంలో న్యాయం ఉందని, ఇందుకు […]
Rain Alert : రాష్ట్రంలో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా, ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యాలు, మొక్కజొన్న, మిర్చి తడిసిపోయాయి. […]