Home / Andhrapradesh
AP Speaker Ayyanna Patrudu Donate 1 month salary to Indian Army: ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మీకి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సైనికులకు తమ వంతు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం ఆర్మీకి విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతం జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా విరాళాన్ని అందజేశారు. […]
Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రవ్యాపంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ-అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి […]
CM Chandrababu inspects Handreeniva Sujala Sravanti works : భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఛాయాపురం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్పై దాడులు చేసిందన్నారు. ఇండియాపై దాడులు చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాక్ దాడుల్లో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. […]
Telugu jawan martyred in firing : భారత్-పాక్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంత్రాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆ క్రమంలో జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్ను మురళీనాయక్గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఏపీలోని రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ […]
AP CM Chandrababu : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్కు కేబినెట్ అభినందలు తెలిపింది. ప్రధాని మోదీ, ఇండియా సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి […]
Chopper Crashes : ఉత్తరాఖండ్లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. అనంతపురం ఎంపీ సోదరి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భగీరథి నది సమీపంలో కూలిన హెలికాప్టర్.. ఉత్తర కాశీలో గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ కూలింది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ఉన్నట్లు అధికారులు […]
Encounter : ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ, ఓడిశా సరిహద్దు ప్రాంతం అల్లూరి జిల్లా వై రామవరం, జీకేవీధి మండలాల్లో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్లో మావోలు ఎదురుపడ్డారు. పోలీసులు, మావోల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత […]
15 foot ల King Cobra mating and Dancing: ఇటీవల కాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లో తిరుగుతున్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఎలుకలు తినడానికి ఇంట్లోకి చొరబడుతున్నాయి. అడవుల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. పాములు కూడా సంభోగం చేస్తాయి. పాములు పంట పొలాల్లో సయ్యాటలు ఆడుతున్న ఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు భారీ కింగ్ కోబ్రాలు వచ్చాయి. రెండు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. అక్కడ […]
Pawan Kalyan responds to Operation Sindoor : పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హిందువులు, ముస్లింలు అని అడిగి చంపిన విధానం చాలా దారుణమన్నారు. ఆపరేషన్ సిందూర్ పవన్ స్పందించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడిని స్వాగతించినట్లు చెప్పారు. చేతులు కట్టేసిన యావత్ దేశానికి ఆపరేషన్ సిందూర్తో తిరిగి వీరత్వాన్ని నింపిందని పవన్ కొనియాడారు. త్రివిధ […]
IAS officer Srilakshmi faces charges in Supreme Court : ఓఎంసీకి సంబంధించిన కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మూడు నెలల్లో మరోసారి విచారణ జరుపాలని సుప్రీం ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా మళ్లీ విచారణ చేపట్టాలని పేర్కొంది. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీం […]