Published On:

Pawan Kalyan : ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan responds to Operation Sindoor : పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హిందువులు, ముస్లింలు అని అడిగి చంపిన విధానం చాలా దారుణమన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌‌ పవన్ స్పందించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడిని స్వాగతించినట్లు చెప్పారు. చేతులు కట్టేసిన యావత్ దేశానికి ఆపరేషన్‌ సిందూర్‌తో తిరిగి వీరత్వాన్ని నింపిందని పవన్ కొనియాడారు. త్రివిధ దళాధిపతులు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కుటుంబాలతో జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ప్రాణాలు తీశారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం అర్ధరాత్రి భారత్ సేనలు పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాకిస్థాన్‌లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుకకుండా ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.

 

పాక్‌కు ఇది తగిన గుణపాఠం..
పాక్‌కు ఇది తగిన గుణ పాఠమని, ప్రధాని మోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమన్నారు. సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. ఇండియా దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడారని పవన్ విమర్శించారు.

 

హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉండటంపై పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించగా, వేర్వేరు కారణాలతో చాలామంది రాష్ట్రానికి వస్తుంటారని, వారంతా మైగ్రంట్లని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరైనా కుల, మతాలు ఒక్కటేనన్నారు. తెలంగాణ సెపరేషన్‌తో నాన్ లోకల్స్‌కు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. మహాత్మాగాంధీ మార్గంలో నడవాలని కోరారు. సహనంతో ఉండటం వల్ల దేశాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు.

ఇవి కూడా చదవండి: