Encounter : అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Encounter : ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ, ఓడిశా సరిహద్దు ప్రాంతం అల్లూరి జిల్లా వై రామవరం, జీకేవీధి మండలాల్లో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్లో మావోలు ఎదురుపడ్డారు. పోలీసులు, మావోల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న మృతిచెందినట్లు తెలుస్తోంది. జగన్పై రూ.20లక్షల రివార్డు ప్రకటించి ఉన్నారు. మరో ఇద్దరు మావోలు సంకు నాచికా, రమేశ్ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రెండు ఏకే-47లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా భద్రతా బలగాలు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తూ మావోలను మట్టుబెతున్నారు.