Published On:

IPL 2025: లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ చేరువలో..!

IPL 2025: లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ చేరువలో..!

Punjab Kings Won By 37 Runs Lucknow Super Giants: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయం నమోదు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన 54వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఏడో విజయం కాగా లక్నో జట్టుకు హ్యాట్రిక్ ఓటమి కావడంతో లక్నోకు ప్లేఆఫ్స్ ఆశలు కష్టతరమయ్యాయి.

 

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్(91), ఇంగ్లిస్(30), శ్రేయస్ అయ్యర్(45), శశాంక్(33), వధేరా(16) పరుగులు చేశారు. అంతకుముందు తొలి ఓవర్‌లో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(1)ను ఆకాశ్ సింగ్ పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్‌తో కలిసి ప్రభ్ సిమ్రన్ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడుతున్న ప్రభ్ సిమ్రన్‌కు తోడవడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. చివరిలో శశాంక్, స్టాయినిస్‌లు వేగంగా పరుగులు చేయడంతో పంజాబ్ 236 పరుగులకు చేరింది. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ , దిగ్వేశ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ ఒక వికెట్ తీశాడు.

 

237 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదనలో లక్నో బ్యాటర్లు పోరాడి ఓడారు. మ్యాచ్ ఆరంభంలోనే లక్నో తడబడింది. తొలి 3 ఓవర్లకు 16 పరుగులు చేసి కీలకమైన 2 వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్(0). మార్ క్రమ్(13)లను అర్ష్ దీప్ ఔట్ చేసి లక్నోకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్(6) ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. ఇక వరుసగా రిషబ్ పంత్(18), మిట్లర్(11) త్వరగానే పెవిలియన్ చేరారు. కష్టాల్లో ఉన్న లక్నోను బదోని(7), సమద్(45) గెలిపించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులకు పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ 3 వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా 2 వికెట్లు, యాన్సెన్, చాహల్ తలో వికెట్ తీశారు.