Home / పొలిటికల్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపి రెబల్ పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణం రాజు నిత్యం రాష్ట్రంలోని పరిస్ధితులను కేంద్రానికి చేరవేసేందులో ప్రతిపక్షం కన్నా ముందుంటున్నారు. తాజాగా ఆయన హైకోర్టు ఉత్తర్వులను సైతం ఏపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షాకు లేఖ వ్రాయడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది.
బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి నారాయణ స్వామి సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వ్యంగ విమర్శలు గుప్పించారు.
పశ్చిమబెంగాల్ లో బీజేపీ నవన్న ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించకముందే ప్రతిపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో పోలీసులతో సువేందు వాగ్వాదానికి దిగారు
భారత్ జోడో యాత్రతో భాజాపా దేశంలో పెద్ద చర్చనే లేవదీసింది. అది కాస్తా రాష్ట్రాలకు కూడా పాకింది. తాజాగా తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో కాంగ్రెస్ శాసనసభ్యులు జగ్గారెడ్డి వేసుకొన్న షర్ట్ పై ఆసక్తికర సంభాషణ సాగింది.
అమరావతి నుండి అరసవల్లి వరకు చేపట్టనున్న అమరావతి రైతులు మహా పాదయాత్ర రెండో రోజుకు చేరుకొనింది
ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి మాట్లాడారు
సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో తనపై బూట్లు విసరడంతో రాజస్థాన్ క్రీడా మంత్రి అశోక్ చంద్నా కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాపై షూ విసిరి సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అయితే, అతన్ని త్వరగా చేయాలి. ఎందుకంటే ఈ రోజు నాకు పోరాడాలని అనిపించడం లేదు.
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో 'దొంగలకు సర్దార్' నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అంతకుమించి మరీ అసభ్య పదజాలాలు ఇది నేటి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఉచ్ఛరిస్తున్న మాటలు. శాసనసభ హుందాతనాన్ని మరిచి మరీ రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూనే పొరుగు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకొనింది.
రాష్ట్రంలో విగ్రహాల ఏర్పాట్ల పిచ్చి ఎక్కువైపోతుంది. స్వాతంత్య్ర సమరయోధులు, మహానుభావులను స్మరించుకోవాల్సిన రాజకీయ పార్టీలు తమ దివంగత నేతల్ని విగ్రహాల రూపంలో ప్రతిష్టిస్తున్నారు. వివాదస్పద ప్రాంతాల్లో సైతం నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.