India vs Pakistan: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. పాక్ కాల్పుల్లో భారత పౌరులు మృతి

Three Indian Civilians Killed in Pakistan Firing: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలతో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.
యూరీ సెక్టార్లో పాక్ సైన్యం ఆర్టిలరీ షెల్లింగ్స్, కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మార్ లో ఎల్ఓసీ వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ సైన్యం చేసిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. అలాగే ఈ కాల్పుల్లో గాయపడిని పలువురిని ఆస్పత్రికి తరలించారు.
కాగా, పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఎదురుదాడికి దిగాయి. భారత సైన్యం చేసిన ఈ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. అయితే భారత్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా పాక్ సైన్యం కాల్పులు చేసినట్లు సమాచారం.