Himanta Biswa Sarma : ఎంపీ భార్యకు పాక్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి.. అస్సాం ముఖ్యమంత్రి ఆరోపణలు

Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల కింద అస్సాంలో పాక్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఎం ఓ కాంగ్రెస్ ఎంపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ గౌరవ్ గగోయ్ భార్యకు సైతం పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పాక్కు 19 సార్లు ప్రయాణించారని సీఎం మీడియా సమావేశంలో వెల్లడించారు. పాక్లో ఆమెకు ఆ దేశ ఆర్మీ సహకరించినట్లు సీఎం చెప్పారు. పాక్లో కోల్బర్న్ పనిచేశారని, ఆ తర్వాత ఆమె ఢిల్లీలోని ఎన్జీవోలో చేసినట్లు పేర్కొన్నారు. కానీ, పాక్ నుంచి ఆమె ఇప్పటికీ జీతం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీ గౌరవ్ గగోయ్ కూడా పాక్కు వెళ్లినట్లు సీఎం బిశ్వశర్మ తెలిపారు.
వారం రోజుల్లో ఎంపీ గౌరవ్ గగోయ్ భార్య భారత్కు తిరిగి వచ్చిందని చెప్పారు. కానీ, గగోయ్ మాత్రం పాక్లోనే ఏడు రోజులు ఉన్నట్లు తెలిపారు. పాక్లో 15 రోజుల పాటు గగోయ్ ఏం చేశారో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. పాక్లో చేశారో చెప్పాలని, వాళ్ల ఆర్మీకి ఎలా ఆయన సహకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికార హోదాలో గగోయ్ పాక్కు వెళ్తే ప్రశ్నించే వాళ్లం కాదని, కానీ ఆయన తన వ్యక్తిగత పనిపై వెళ్లారన్నారు. పాక్లో ఆయన ఎవరితో ఏం మాట్లాడారో తెలియాలని బిశ్వ శర్మ చెప్పారు.