Last Updated:

Ravindra Jadeja: ప్రధాని మోదీని కలిసిన రవీంద్ర జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు

Ravindra Jadeja: ప్రధాని మోదీని కలిసిన రవీంద్ర జడేజా

 Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు. జడేజా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రధాని మోదీని కలిసిన ఫోటోను పంచుకున్నాడు. ఫోటోలో, జడేజా మరియు అతని భార్య ప్రధాని నరేంద్ర మోడీకి పుష్పగుచ్ఛం అందించడాన్ని చూడవచ్చు.

నరేంద్రమోదీ సాహెబ్ మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. మీరు మా మాతృభూమొ కోసం కృషి మరియు అంకితభావానికి ఒక ప్రధాన ఉదాహరణ. మీరు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడం కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ జడేజా ట్వీట్ చేసాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు..(Ravindra Jadeja)

మే 20న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.రవీంద్ర జడేజా ఇప్పటి వరకు ఐపీఎల్ 2023లో 13 మ్యాచ్‌ల్లో 133 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అతను ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. టోర్నమెంట్ యొక్క ప్లేఆఫ్ దశలో జడేజా కీలకపాత్ర పోషిస్తాడని అంచనాలున్నాయి.