Last Updated:

Rahul Gandhi in Lok Sabha: లోక్‌సభలో శివుడి ఫోటో చూపించిన రాహుల్ గాంధీ

హిందూత్వం భయం, ద్వేషాలను వ్యాప్తి చేయదు.. అయితే బీజేపీ అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అంటే భయం, ద్వేషం మరియు అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని బీజేపీపై మండిపడ్డారు.

Rahul Gandhi in Lok Sabha:  లోక్‌సభలో శివుడి ఫోటో చూపించిన  రాహుల్ గాంధీ

 Rahul Gandhi in Lok Sabha: హిందూత్వం భయం, ద్వేషాలను వ్యాప్తి చేయదు.. అయితే బీజేపీ అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అంటే భయం, ద్వేషం మరియు అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని బీజేపీపై మండిపడ్డారు.

మీరు హిందువు కాదు..( Rahul Gandhi in Lok Sabha)

మన మహానుభావులందరూ అహింస మరియు భయాన్ని అంతం చేయడం గురించి మాట్లాడారు. కానీ, తమను తాము హిందువుగా చెప్పుకునే వారు హింస, ద్వేషం మరియు అసత్యం గురించి మాత్రమే మాట్లాడతారని రాహుల్ గాంధీ అన్నారు. మీరు హిందువు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సభలోనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకున్నారు.మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పిలవడం సరికాదన్నారు. దీనికి రాహుల్ గాంధీ బదులిస్తూ బీజేపీ, ప్రధాని మోదీలు మొత్తం హిందూ సమాజం కాదని అన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ సభలో శివుడి బొమ్మను చూపించడాన్ని స్పీకర్ ఓం బిర్లా వ్యతిరేకించారు. ప్లకార్డుల ప్రదర్శనను రూల్స్ కు విరుద్దమని అన్నారు. ప్రధానిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ బీజేపీ, ప్రధాని మోదీలు మొత్తం హిందూ సమాజం కాదని అన్నారు.

గాంధీ చనిపోలేదు..

అధికార పార్టీ ప్రతిపాదించిన ఆలోచనలను లక్షలాది మంది ప్రజలు ప్రతిఘటించారని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం మరియు భారతదేశ ప్రాథమిక ఆలోచనపై బీజేపీ క్రమబద్ధమైన దాడులను ప్రారంభిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నాపై దాడి జరిగింది. నా పై 20కి పైగా కేసులు పెట్టారు. ఎంపీ గా నా బంగ్లాను లాక్కున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 55 గంటల విచారణ జరిపిందని అన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని రక్షించడంలో చేసిన సమిష్టి కృషికి గర్వపడుతున్నానని చెప్పారు. ప్రధానమంత్రి గాంధీ చనిపోయారని, గాంధీని ఒక సినిమా ద్వారా పునరుద్ధరించారని చెప్పారు. గాంధీ చనిపోలేదు. గాంధీ జీవించి ఉన్నారు. నేను గమనించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధైర్యం గురించి మాట్లాడేది ఒక్క మతం కాదు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడతాయని రాహుల్ గాంధీ అన్నారు.

ఇవి కూడా చదవండి: