Home / జాతీయం
ఢిల్లీలోని ఓ నర్సింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులను దొంగతనం చేశారనే అనుమానంతో హాస్టల్ వార్డెన్ వారి బట్టలు విప్పించి వేధింపులకు గురిచేసినట్ల పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
బీహార్లో కుల ఆధారిత జనాభా గణనపై పాట్నా హైకోర్టు గురువారం స్టే విధించింది. రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ జనాభా లెక్కలను వ్యతిరేకించింది.
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం శృంగార లేదా ఏకాభిప్రాయ సంబంధంలో ఉన్న మైనర్లను శిక్షించడానికి మరియు వారిని నేరస్థులుగా ముద్రించడానికి ఉద్దేశించినది కాదని బాంబే హైకోర్టు పేర్కొంది
రానికి ఐదు రోజుల పని విధానం డిమాండ్ను పరిశీలిస్తామని తెలిపింది. అయితే అందుకు బదులుగా ఉద్యోగుల రోజువారీ పని వేళలను మరో 40 నిమిషాలు పెంచుతామని పేర్కొంది.
ఓటు వేసేటపుడు ‘జై బజరంగబలి’ అనండి అంటూ కర్ణాటక ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కోరారు. బజరంగ్దళ్ని నిషేధిస్తానని హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బజరంగబలి ని నిషేదిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) యొక్క కార్మికులు, మద్దతుదారులు మరియు సహచరులపై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ గురువారం బీహార్ మరియు జార్ఖండ్లోని 14 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
BRS office: దిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత.. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఘనంగా ప్రారంభించారు.
బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసు సిబ్బందితో గొడవ తర్వాత, నిరసనకు దిగిన రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా గురువారం తమ పతకాలు మరియు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఇలా అవమానాలకు గురవుతుంటే ఈ సన్మానాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అన్నారు.
:మణిపూర్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఎటిఎస్ యుఎం) పిలుపునిచ్చిన గిరిజన సంఘీభావ యాత్ర సందర్భంగా హింస చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల కోసం గిరిజనేతర మీటీలు చేస్తున్న డిమాండ్కు నిరసనగా ఈ యాత్రను చేపట్టారు. మణిపూర్లోని అనేక ప్రభావిత జిల్లాల్లో సైన్యం మరియు అస్సాం రైఫిల్ సిబ్బందిని మోహరించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజాపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లతో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ నిరసన కాస్త బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉద్రిక్తతతకు దారితీసింది