Last Updated:

Padma Awards: ములాయంకు పద్మ విభూషణ్.. సుధామూర్తి, చిన జీయర్ స్వామిలకు పద్మ భూషణ్ అవార్డులు

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందజేసారు.ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు బుధవారం మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది.

Padma Awards:  ములాయంకు పద్మ విభూషణ్.. సుధామూర్తి, చిన జీయర్ స్వామిలకు పద్మ భూషణ్  అవార్డులు

Padma Awards: ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందజేసారు.ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు బుధవారం మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది.

అవార్డుల కార్యక్రమంలో రిషి సునక్ భార్య..(Padma Awards)

ములాయం కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు.ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య మరియు రచయిత్రి సుధా మూర్తి సామాజిక సేవ కోసం పద్మభూషణ్‌తో సత్కరించారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అయిన మూర్తి కుమార్తె అక్షత, రాష్ట్రపతి భవన్‌లోని గంభీరమైన దర్బార్ హాల్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ప్రముఖులతో పాటు ముందు వరుసలో కూర్చొని ఉన్నారు.‘నాటు నాటు’ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. గతంలో ఈ పాటకు కీరవాణి ఆస్కార్‌ అందుకున్నారు.ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో స్టాటిస్టికల్ ఫిజిక్స్‌లో సుదీర్ఘ పరిశోధనా వృత్తిలో పేరుగాంచిన భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్, నవలా రచయిత ఎస్ ఎల్ భైరప్ప, ప్రముఖ నేపథ్య గాయని వాణీ జైరామ్, వేద పండితుడు త్రిదండి చిన జీయర్ స్వామీజీలకు పద్మభూషణ్ ప్రదానం చేశారు.

అవార్డు గ్రహీతల్లో విదేశీయులు..

సూపర్ 30 ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ప్రెసిడెంట్ ముర్ము నుండి పద్మశ్రీ అందుకున్నారు. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘సూపర్‌ 30’ తెరకెక్కింది.నటి రవీనా టాండన్‌కు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది.ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్ మరియు 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.