Last Updated:

Tiranga March: పార్లమెంట్ నుంచి తిరంగా మార్చ్ చేపట్టిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం ముగియడంతో పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు 'తిరంగా మార్చ్' చేపట్టారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వమే పార్లమెంట్‌ను నడపనివ్వడం లేదు.. అదానీ స్కాంపై ఎందుకు చర్చకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు.

Tiranga March: పార్లమెంట్ నుంచి తిరంగా మార్చ్  చేపట్టిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు

Tiranga March: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం ముగియడంతో పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ‘తిరంగా మార్చ్’ చేపట్టారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వమే పార్లమెంట్‌ను నడపనివ్వడం లేదు.. అదానీ స్కాంపై ఎందుకు చర్చకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు. అదానీ స్టాక్స్‌పై సంయుక్త పార్లమెంటరీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నిరసన నేపథ్యంలో లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఎంపీల పాదయాత్ర ప్రారంభమైంది.

‘ఈవినింగ్ టీ’ సమావేశానికి గైర్హాజరు..(Tiranga March)

పాదయాత్ర తర్వాత కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విలేకరుల సమావేశం కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఇదిలావుండగా, ఈరోజు లోక్‌సభ స్పీకర్ నిర్వహించనున్న ‘ఈవినింగ్ టీ’ సమావేశానికి కాంగ్రెస్‌తో సహా మూడు రాజకీయ పార్టీలు గైర్హాజరవుతాయని వర్గాల సమాచారం.టీ మీటింగ్‌ను బహిష్కరించే పార్టీలలో కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), మరియు తృణమూల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) , రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), జనతాదళ్ (యునైటెడ్), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), రాష్ట్రీయ జనతాదళ్ (RJD), సమాజ్ వాదీ పార్టీ, శివసేన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి. బుధవారం ఉదయం పార్లమెంటు భవనంలోని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరైన సమావేశంలో తిరంగా మార్చ్ కు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిపక్షాల మాట వినాలి..

డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ముస్లిం లీగ్ నేతలు సమావేశానికి ఈ హాజరయ్యారు. ప్రజాస్వామ్య మార్గంలో పోరాడటం మా కర్తవ్యం. ప్రభుత్వం వినకపోతే మొండితనం. ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే ప్రతిపక్షాల మాట వినడం ముఖ్యం  అని ఖర్గే ఈరోజు బడ్జెట్ సమావేశాల చివరి రోజు అన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంటుకు అనర్హత వేటు వేసినప్పటికీ ఆయన క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఇంకా ఉందని ఖర్గే అన్నారు. విపక్షాలను బలహీనపరిచేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఖర్గే అన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు వివిధ సమస్యలపై ప్రతిపక్ష ఎంపీల నిరసనతో లోక్‌సభ గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అదానీ అంశంపై హిండెన్‌బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం మరియు సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు మరియు ప్రధాని నరేంద్ర మోడీని అవమానించినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేయడంతో బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముగిసింది.