Home / Jammu and Kashmir
Farooq Abdullah travels in Vande Bharat train : జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్-కట్ఢా మార్గంలో ఇటీవల వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా, మంగళవారం ట్రైన్లో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రయాణించారు. దేశ రైల్వే నెట్వర్క్తో కశ్మీర్ మొత్తం అనుసంధానం కావడాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయన్నారు. జులైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నదని, భక్తులు ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. వైష్ణోదేవీ ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారని ఆశాభావం వ్యక్తం […]
PM Modi-Jammu and Kashmir CM Omar Abdullah : ప్రధాని మోదీ తనను త్వరలో ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మోదీ వద్ద రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చినప్పుడు తను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నానని పేర్కొన్నారు. తాను ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా డిమోట్ […]
CBI charges former Jammu and Kashmir Governor: జమ్మూకశ్మీర్లో ఓ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసుకు సంబంధించి గతంలో ఆయన ఇండ్లల్లో సీబీఐ సోదాలు జరిపింది. తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో పేర్కొంది. రూ.2,200 వేల కోట్ల అవినీతి.. కిష్త్వార్లో రూ.2,200 వేల కోట్ల విలువైన కిరు […]
Encounter in Avanti Pohra Area of Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు హద్య ఎదురుకాల్పులు జరిగాయి. జమ్మూకశ్మీర్లోని నాడర్, ట్రాల్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ను భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టాయి. కాగా, గత రెండు రోజుల వ్యవధిలో జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకోవడం రెండో సారి. పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. నాదిర్ […]
Indian Army announce Operation Keller: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరిపారేస్తోంది. చివరి ఉగ్రవాది అంతమయ్యేవరు ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా భారత ఆర్మీ కొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ‘ఆపరేషన్ కెల్లర్’ పేరుతో ఉగ్రవాదులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా షోపియన్లో దాడులు జరిపింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు […]
India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా […]
Pahalgam : పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించగా, ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కలకలం చెలరేగింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన వ్యక్తి.. ఉగ్రదాడి జరిగిన బైసరన్ […]
A Man To Have Helped Terrorists In Pahalgam Attack Jumps Into River: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఉగ్రవాదులకు సహకరించిన 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను భద్రతా బలగాలే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించేందుకు అతడిని తీసుకెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా బలగాల నుంచి అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా తంగ్మార్గ్కు చెందిన ఇంతియాజ్ పారిపోయే తరుణంలో ఓ నదిలోకి దూకేశాడు. […]
Terror Strike attempt chance In Jammu and srinagar jails: జమ్మూకశ్మీర్లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఐదు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనగర్, జమ్ములోని జైళ్ల లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. కాగా, జమ్మూకశ్మీర్ జైళ్లలో హైప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత […]
India to Meet Today India-Pakistan Tensions: యూఎన్ఎస్సీ అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను యూఎన్ఎస్సీ చర్చించనుంది. ఈ ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్ను పాక్ కోరింది. భారత్ చర్యలు శాంతిభ్రదతలకు హాని కలిగిస్తున్నాయని పేర్కొంది. అయితే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి అంశాలను యూఎన్ఎస్సీ దృష్టికి పాక్ తీసుకెళ్లనుంది. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని యూఎన్ఎస్సీ దృష్టికి భారత్ తీసుకెళ్లనుంది. […]