Published On:

Earthquake in Arunachal Pradesh: ఉదయాన్నే అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు!

Earthquake in Arunachal Pradesh: ఉదయాన్నే అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు!

Earthquake in Arunachal Pradesh, Magnitude 3.8 Strike: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో 5.06 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవంచింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని సమాచారం. భూకంప ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరోవైపు, ఇండోనేషియాలో కూడా ఉదయం భూకంపం వచ్చింది. సుమత్రాలో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ఉత్తర సుమత్రాలో వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం 58 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ ఘటనలో కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.