Published On:

Covid -19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Covid -19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

 

Covid -19: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఏలూరు కలెక్టరేట్‌లో నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని.. నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు గుర్తించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కరోనా కేసు నమోదైంది.

 

కేరళలో ఉద్యోగం కోసం వెళ్లి వచ్చిన విద్యార్థికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ వార్డు లేకపోవడంతో అడ్మిషన్‌ కుదరదని వైద్యులు తెలిపారు. తిరుపతి వెళ్లాలని బాధితుడికి సూచించారు. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ డోస్ వేసుకున్నవాళ్లకు కూడా ఇప్పుడు కోవిడ్ సోకుతుందని తెలుస్తోంది.

 

 

గతంలో కరోనా బీభత్సం ఏ మేరకు జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో కరోనా విలయం అంతగా లేదు, వాక్సిన్ కనిపెట్టి, దానిపై చావుదెబ్బ కొట్టాం అని చెప్పుకున్నారు. రెండేళ్లగా అనేక వ్యాధులు బయట పడుతున్నాయి. ఇవి కరోనా అనంతర వ్యాధులనీ, కొన్ని కరోనా కారణంగా వస్తే, మరి కొన్ని కరోనా వ్యాక్సిన్ కారణంగా కలుగుతున్నాయని అంటున్నారు.

 

బాధితుల్లో బూస్టర్ డోసు వేసుకున్న వారు ఎక్కువమంది ఉన్నారట… వాక్సినేషన్ జోరుగా సాగే రోజుల్లో వాక్సిన్ వలన అవాంఛిత పరిణామాలు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన వారిపై వాక్సిన్ కంపెనీలు కేసులు పెట్టాయి. 2020 నవంబరులో కోవిషీల్డు తయారు చేసిన సీరమ్ వాళ్లు ఒక వాలంటీరుపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానన్నాడు.

 

 

 

ఇవి కూడా చదవండి: