Published On:

NIA on Jyoti Malhotra Case: ఏఎన్‌ఐ విచారణ.. జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు!

NIA on Jyoti Malhotra Case: ఏఎన్‌ఐ విచారణ.. జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు!

Jyoti Malhotra Case Update: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్‌ఐ విచారణలో జ్యోతి పాక్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించిందని, రహస్యంగా ఉంచేందుకు ఎన్‌క్రిప్టెడ్‌ డివైజ్‌లు వినియోగించిన‌ట్లు తేలింది. ఎన్ఐఏ విచార‌ణ‌లో జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్ర‌పంచానికి తాను వ్లాగ‌ర్‌గా ప్ర‌మోట్ చేసుకుంటుంది. కానీ, అస‌లు విష‌యం హర్యానా పోలీసులు బయటపెట్టారు. ఎన్‌క్రిప్టెడ్ డివైజ్‌ల‌ను ఉప‌యోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాక్ ఏజెంట్లతో ఎప్పుడూ టచ్‌లో ఉండేద‌ని పోలీసులు తెలిపారు.

 

ట్రావెల్‌ విత్‌ జో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహణ..

హర్యానాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్‌ విత్‌ జో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నడుపుతోంది. ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. జ్యోతి ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. చైనా, పాక్, ఇండోనేసియాల్లో వీడియోలు కూడా తీసింది. ఈమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోష‌ల్ మీడియా పోస్టుల్లో భారతీయుల‌కు పాక్ మంచి దేశంగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం, ఉగ్ర‌దాడికి ముందు ప‌హ‌ల్గామ్‌లో ప‌ర్య‌ట‌న, ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్య కార్యాల‌యం ఉద్యోగి ఇషాన్ దార్‌తో స‌న్నిహితంగా ఉండ‌డంతో ఈ నెల 16వ తేదీన ఆమెపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా న‌మోదైంది.

 

ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు..

గూఢ‌చ‌ర్యం కేసులో జ్యోతి మల్హోత్రాను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. విచారణలో ఈషాన్ దార్‌తో ఆమె సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది. పాక్‌లో పర్యటన, ఐఎస్‌ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్‌ సందర్శించింది. కశ్మీర్‌ పర్యటనకు ముందు పాక్‌కు వెళ్లింది. రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీశ్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో కొత్త అనుమానాలకు తెర తీసినట్లైంది.

 

పాక్‌కు వెళ్లిన విషయం తెలియదు : జ్యోతి తండ్రి

ఓసారి తన కుమార్తె జ్యోతి యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు తనకు చెప్పిందని ఆమె తండ్రి హరీశ్ మల్హోత్రా చెప్పారు. కానీ పాక్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. మరోసారి ఢిల్లీకి కాదని, తాము ఉంటున్న ఇంట్లో వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని అతడు చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.

ఇవి కూడా చదవండి: